Allu Arjun: బాలీవుడ్ హీరో తో మల్టీస్టారర్ బిజినెస్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్

Allu Arjun: బాలీవుడ్ హీరో తో చేతులు కలపనున్న అల్లు అర్జున్

Update: 2023-04-10 07:00 GMT

Allu Arjun: బాలీవుడ్ హీరో తో మల్టీస్టారర్ బిజినెస్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్

Allu Arjun: ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే దానిని మల్టీ స్టారర్ సినిమా అంటారు. మరి ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి ఒక బిజినెస్ చేస్తే దానిని మల్టీస్టారర్ బిజినెస్ అనొచ్చేమో. అలాంటి ఒక మల్టీస్టారర్ బిజినెస్ చేయడానికి చేతులు కలపబోతున్నారు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్.

బాలీవుడ్ స్టార్ సీనియర్ నటుడైన అమితాబ్ బచ్చన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ కి కూడా బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ భర్త అయిన అభిషేక్ బచ్చన్ చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మరోవైపు "పుష్ప" సినిమాతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ కూడా బీభత్సంగా పెరిగింది. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్పోర్ట్స్ బిజినెస్ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అభిషేక్ బచ్చన్ జైపూర్ పింక్ పాంథర్స్ అనే కబడ్డీ టీం మరియు చెన్నయిన్ ఎఫ్ సీ అనే ఫుట్ బాల్ టీం లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా సత్యం థియేటర్ ను ఏషియన్ గ్రూప్ వారితో చేతులు కలిపి మాల్ లాగా మార్చారు. అయితే తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ అభిషేక్ బచ్చన్ తో కలిసి ఒక స్పోర్ట్స్ బిజినెస్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఈ బిజినెస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Tags:    

Similar News