‍Naandhi: విజయానికి ఎనిమిదేళ్లు పట్టింది.. నరేశ్ ఎమోషనల్

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేశ్ కు శుక్రవారం రిలీజైన ‘నాంది’ సినిమా కొంత ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి.

Update: 2021-02-20 09:55 GMT

నాంది సక్సెస్ మీట్

Tollywood Latest News: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేశ్ కు శుక్రవారం రిలీజైన 'నాంది' సినిమా కొంత ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. తన కామెడీ ఇమేజ్ ను పక్కన పెట్టి ప్రయోగంగా చేసిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నరేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కేవలం కామెడీ పాత్రలే కాదు ఎమోషనల్ పాత్రల్లోనూ రాణించగలడని 'నాంది' తో నిరూపించుకున్నాడు.

చాలా కాలం తర్వాత 'నాంది'తో విజయం అందుకోవడంతో నరేశ్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ నేపథ్యంలో 'నాంది'టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నరేశ్ చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని ఏడ్చేశాడు.

'2012 లో 'సుడిగాడు' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత అలాంటి విజయం దక్కిందని నరేశ్ సంతోష పడుతున్నాడు. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్న నన్ను నిర్మాత సతీష్‌ వేగేశ్న నమ్మి ప్రోత్సహించారు. విజయం సాధిస్తుందో లేదో అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్‌ సినిమాకు ఎక్కడ ప్రాబ్లమ్‌ అవుతుందో అనే టెన్షన్‌ ఉండేది. కానీ ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ల్‌ చేసి మెచ్చుకుంటున్నారు'అని నరేశ్‌ ఎమోషల్‌ అయ్యారు. డైరెక్టర్‌ విజయ్‌ తనకు సెకండ్‌ బ్రేక్‌ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Tags:    

Similar News