Sai Pallavi: దేవదాసీల సైకాలజీ తెలిసింది అంటున్న సాయి పల్లవి

అనురాగ్ కులకర్ణి, ఇతర డాన్సర్ల పర్ఫామెన్స్ చూసి సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి: సాయి పల్లవి

Update: 2021-12-22 10:02 GMT

సాయి పల్లవి (ట్విట్టర్ ఫోటో) 

Sai Pallavi: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "శ్యామ్ సింగరాయి" పైనే పెట్టుకున్నాడు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, సాయిపల్లవి మరియు మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న సాయి పల్లవి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా ద్వారా దేవదాసీల సైకాలజీని తెలుసుకునే అవకాశం కలగటం తనకి చాలా బాగా నచ్చిందని చెప్పింది సాయి పల్లవి.

"ఎప్పుడో చిన్నప్పుడు దేవదాసీల సిస్టం గురించి విన్నాను. వాళ్లని దేవుని సేవకులు అంటారు కానీ తరువాత అది ఒక చెడ్డ పదం లాగా మారింది. కానీ ఈ సినిమాలో మాత్రం అనవసరమైన విషయాలను పక్కనపెట్టి కేవలం కథకి కావలసినంత వరకు మాత్రమే తీసుకున్నాము" అని చెప్పింది సాయి పల్లవి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున అనురాగ్ కులకర్ణి మరియు ఇతర డాన్సర్ల పర్ఫామెన్స్ చూసి తను చాలా ఎంజాయ్ చేశానని సంతోషంతో తన కళ్ళలో నీళ్ళు తిరిగాయని అవి ఆనందభాష్పాలు అని క్లారిటీ ఇచ్చింది సాయిపల్లవి. ఇక తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ "విరాటపర్వం" షూటింగ్ పూర్తయింది కానీ డబ్బింగ్ వర్క్ మాత్రం ఇంకా పెండింగ్లో ఉందని, మరో వైపు ఒక తమిళ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉందని అంటోంది సాయి పల్లవి.

Tags:    

Similar News