నటుడు ఫృధ్వీకి బెజవాడ కోర్టు షాక్.. భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశం

*భార్యను ఇంటి నుంచి గెంటేసిన ఫృథ్వి

Update: 2022-10-01 10:32 GMT

నటుడు ఫృధ్వీకి బెజవాడ కోర్టు షాక్.. భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశం

Prudhviraj: భార్యకు భరణం ప్రతినెలా భరణం చెల్లించాలని సినీ నటుడు పృద్వీరాజ్ కు బెజవాడ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెలకు 8 లక్షలు భరణం ఇవ్వాలని పృద్వీ రాజ్‌ను కోర్టు ఆదేశించింది. బెజవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృద్వీ రాజ్ కు 1984లో వివాహం అయ్యింది. పెళ్లైయ్యాక సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించటానికి ఆర్థిక సాయం చేశామని, పలు మార్లు తనని వేధించారని ఫిర్యాదులో పృద్వీ రాజ్ భార్య శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపింది. ఇంటి నుంచి పృద్వి రాజ్ గెంటేయటంతో పుట్టింటిలో ఉంటున్నానని తనకు భరణం చెల్లించాలని 2017లో కోర్టుని శ్రీలక్ష్మి ఆశ్రయించింది. దీంతో.. శ్రీలక్ష్మి కేసు దాఖలు చేసినప్పటి నుంచి భరణం చెల్లించాలని పృద్వీకి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags:    

Similar News