స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన కాంగ్రెస్ నామినేషన్ల దాఖలుకు చివరిరోజున అనూహ్యంగా ఓ అభ్యర్థిని మార్చేసింది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉదయ మోహన్ను చివరినిమిషంలో మార్చేసింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ బీ ఫామ్తో ఎమ్మెల్సీ పదవికి కొమ్మూరి ప్రతాప్రెడ్డి నామినేషన్ వేశారు.