PM Modi: నేడు న్యూయార్క్‌లో యూఎన్‌ఓ 76వ వార్షిక సర్వసభ్య సమావేశం

PM Modi: సాయంత్రం 6.30కి సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

Update: 2021-09-25 03:15 GMT
యుఎన్ఓ సర్వసభ్య సమావేశం (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూయార్క్‌లో యూఎన్‌ఓ 76వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకాంక్షించారు. కొవిడ్‌, వాతావరణ మార్పులు, వాణిజ్య భాగస్వామ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీతో శుక్రవారం శ్వేతసౌధంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Tags:    

Similar News