Andhra Pradesh: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

Andhra Pradesh: పదో తరగతి పరీక్షా విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

Update: 2022-08-22 11:58 GMT

Andhra Pradesh: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పదవ తరగతిలో 11 పేపర్లు ఉండేవి. కరోనా కారణంగా ఏడు పేపర్లకు కుదించారు. తాజాగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లుగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

Tags:    

Similar News