షాద్‌నగర్‌లో దారుణం.. వెటర్నరీ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి..

Update: 2019-11-28 07:37 GMT

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డి అనే యువతి హత్యకు గురైంది. పని ముగించుకొని తిరిగి వస్తుండగా గచ్చిబౌలిలో తన వెహికల్‌ పాడైపోయిందని కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పింది ప్రియాంక. చుట్టు పక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని భయం భయంతో చెప్పింది. ప్రియాంక ఫోన్‌ కాసేపటికే స్విచ్ఛాఫ్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జి కింద ప్రియాంక శవమై కన్పించింది. కిడ్నాప్‌ చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Tags:    

Similar News