విషాదం: ఇద్దరు యువతులు ఆత్మహత్య.. గుండెల్ని పిండేస్తున్న సూసైడ్ లెటర్ !

Update: 2020-02-08 05:25 GMT
ఇద్దరు యువతులు ఆత్మహత్య

ఇద్దరు యువతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ హయత్‌నగర్‌లో జరిగింది. ఇరుగుపొరుగున నివాసం ఉంటున్న అమ్మాయిలు ఒకే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని తనువు చాలించడం తీవ్ర విషాదం నింపింది.

ఆ ఇద్దరమ్మాయిలవి వేర్వేరు ప్రాంతాలు. బతుకుదెరువు కోసం కుటుంబాలు నగరానికి వలస రావడంతో ఇరుగుపొరుగున చేరారు. చేదోడువాదోడుగా ఉంటూ చక్కగా కలసిపోయారు. ఏమైందో ఏమో తెలియదు ఆకస్మికంగా ఇద్దరూ ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరమ్మాయిలు ఒక్కటిగా చనిపోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

ఇద్దరు యువతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మహబూబ్‌నగర్ జిల్లా పోతునపల్లికి చెందిన మమత కుటుంబం కొన్నేళ్ల కిందట నగరానికి వలస వచ్చింది. హయత్ నగర్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటోంది. కర్నూల్ జిల్లా మాధవరం మండలం వెలుగోడు గ్రామానికి చెందిన గౌతమి కుటుంబం కూడా బతుకుదెరువు కోసం వచ్చి అదే కాలనీలో ఉంటోంది.

ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలియదు శుక్రవారం మమత, గౌతమి ఇద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

మమత తల్లిదండ్రులు మహబూబ్‌నగర్‌లో వివాహానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. అయితే చనిపోయే ముందు వారు రాసిన సూసైడ్ లెటర్‌ గుండెల్సి పిండేస్తోంది. అమ్మానాన్నలకు భారంగా ఉన్నామని ఇకపై అలా ఉండకూడదనే ఈ లోకాన్ని విడిచివెళ్తున్నామని రాసి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

Tags:    

Similar News