దారుణం : చాక్లెట్ దొంగిలించాడని దాడి.. విద్యార్థి మృతి

Update: 2020-02-17 06:47 GMT
దారుణం : చాక్లెట్ దొంగిలించాడని దాడి.. విద్యార్థి మృతి

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి సతీష్‌ని వనస్థలిపురం డీ మార్ట్‌ షాపింగ్‌ మాల్‌ సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. దీంతో విద్యార్థి సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న రాత్రి డీమార్ట్‌లో స్నేహితులతో పాటు విద్యార్థి షాపింగ్‌కు వచ్చాడు.

డీమార్ట్‌ సెక్యూరిటీ, సతీష్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీమార్టులో చాక్లెట్‌ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్‌ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News