పోలిస్ అని చెప్పి బంగారు గొలుసు లాక్కెళ్ళాడు ...

Update: 2019-08-23 14:07 GMT

నగరంలో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది . ఎలా వచ్చి ఎం చెప్పి ఎం ఎత్తుకేళ్ళుతున్నారో అర్ధం కావడం లేదు ... తాజాగా గురువారం పంజాగుట్టాలో ఓ ఆగంతకుడు పోలిస్ అని చెప్పి ఓ వ్యక్తి దగ్గర బంగారు గోలిసును కొట్టేశాడు . ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రవిచంద్ర సింగ్ అనే వ్యక్తి తమ బంధువులను కలవడానికి పది గంటల ప్రాంతంలో నిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు .బంధువులను పరామర్శించి ఇంటికి వెళ్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి తానూ పోలీసును అంటూ అతని మేడలో ఉన్న గొలుసును లాక్కెళ్ళి పోయాడు . తిరిగి చూసేలోపే అతను కనిపించకుండా పోయాడు . దీనితో రవిచంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించాడు . జరిగిన విషయం చెప్పాడు . తానూ ఈరోజే బంగారం కొన్నానని దానికి సంబంధించిన రసీదును కూడా చూపించాడు . దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు . 

Tags:    

Similar News