ఇంట్లో అద్దేకుంటూ యజమానురాలు కూతురుపైనే అత్యాచారం...

పల్లకొండ వీరస్వామి(38) అనే వ్యక్తీ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఇంట్లో మూడు నెలల కింద అద్దెకి దిగాడు ..

Update: 2019-08-17 08:17 GMT

రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని రహమత్‌నగర్‌లో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే .. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) అనే వ్యక్తీ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఇంట్లో మూడు నెలల కింద అద్దెకి దిగాడు .. తన భార్య పిల్లలపై విభేదాలు ఉండడం వలన వారికీ దూరంగా ఉంటున్నాడు వీరస్వామి .. ఈ క్రమంలో వీరస్వామి ఇంటి యజమాని కూతురుపైన కన్ను పడింది .

ఈ నేపధ్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్ళిన యజమానురాలు మతిస్థిమితం లేని తన కూతురుని ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది . ఈ సమయంలో వీరస్వామి ఆమెని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు... సాయింత్రం ఇంటికి వచ్చిన తన తల్లికి విషయం తెలియడంతో స్థానికులను పిలిపించి జరిగిన విషయాన్నీ చెప్పింది . స్థానికులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని 24 గంటల్లో పట్టుకొని ఐపీసీ 376(2)(1), 448 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు ,. 

Tags:    

Similar News