సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

Update: 2018-09-18 13:49 GMT

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గం కల్లూరులో పర్యటించిన రోజా.. 'రావాలి జగన్, కావలి జగన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలుచేస్తామని ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. నిత్యం ప్రజలను మోసం చేస్తూ అధికార దుర్వినియోగంతో చంద్రబాబు ప్రజల జీవితాల్లో చీకట్లు నింపారని ఆరోపించారు. కుమారుడు లోకేష్ ఆస్తులు పెంచుకుంటూ.. రాష్ట్రాన్ని 2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె విమర్శించారు.

Similar News