చైనా కంపెనీకి చెందిన రెడీమి ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. శంషాబాద్ చెందిన చిట్టిబాబు ఇటీవలే రెడ్మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. ఇవాళ ఉదయం చిట్టిబాబు కూరగాయల మార్కెట్ కు వెళ్ళాడు.. అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే ఫోన్ను కిందికి విసిరేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్ పేలిపోయింది. దీంతో చిట్టిబాబు రెడీమి కంపెనీ ఫిర్యాదు చేశాడు.