హైదరాబాద్ ఉప్పల్ లో విషాదం చోటుచేసుకుంది... ఉప్పల్ స్టేడియం గేట్ నెం 1 సమీపంలో మ్యాన్హోల్లో క్లీన్ చేస్తూ ఊపిరి ఆడక ఇద్దరు మృతి చెందారు. స్టేడియం దగ్గర ఇద్దరు ఎల్అండ్ టీ సిబ్బంది మ్యాన్హోల్ను శుభ్రం చేసేందుకు అందులో దిగారు. అయితే కొద్దిసేపట్టికే ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మ్యాన్హోల్లో నుంచి మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒరిస్సాకు చెందిన సంతోష్, విజయ్గా గుర్తించారు. వీరిరువురు ఎన్.ఎన్.టిలో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు.