హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది.. మహిళ మృతదేశాన్ని పార్సిల్ చేసి రైల్వేట్రాక్ పక్కన పడేశారు. ఈ దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ ప్రాంతమైన డబీర్ పుర లోని రైల్వే ట్రాక్ పై ప్రయాణికులకు ఓ పార్శిల్ కంటపడింది. దీంతో పోలీసులకు సమాచారమందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఎక్కడో మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పార్శిల్ చేసినట్టు గుర్తించారు..కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మహిళను రెండు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.