బ్రేకింగ్ : బీజేపీకి ఎదురుదెబ్బ!

Update: 2018-05-17 17:01 GMT

బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో అధికారణాన్ని సంపాదించామన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బీజేపీ నేతల ఆనందానికి గండి కొట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుంది తృణముల్ కాంగ్రెస్. రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.ఇటీవల 825 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగగ.. ఇప్పుటి వరకు వెలువడిన ఫలితాల్లో 240 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది. ఇందులో బీజేపీ సహా విపక్షాలు కనీసం ఖాతా కూడా తెరవలేదు. 3215 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నిక జరగగా ఇప్పటివరకు 1053 స్థానల్లో టీఎంసీ, 91 స్థానాల్లో బీజేపీ, 8 లెఫ్ట్, కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 

Similar News