వియత్నాం అధ్యక్షుడు కన్నుమూత

Update: 2018-09-21 14:32 GMT

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్(61) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శుక్రవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వియత్నాం లోని హనోయ్ మిలిటరీ ఆసుపత్రిలో చేరారు.. శుక్రవారం అయన  ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతొ ఉదయం 9గంటల సమయంలో కన్నుమూశారు. వియత్నాం అధ్యక్షుడు అయన మృతిచెందాడని హనోయ్ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది. కాగా ఏప్రిల్ 2, 2016 క్వాంగ్ జాతీయ అసెంబ్లీ ఎన్నికై అధ్యక్ష పదవికి ఎన్నికైన ఆయన.. అంతకంటే ముందు  పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిగా, HIV / AIDS నివారణ కమిటీ వైస్ ఛైర్మెన్ గా పనిచేశారు.

Similar News