రెండు నియోజకవర్గాల్లో సిద్ధరామయ్య పోటీ

Update: 2018-05-12 04:01 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప శికారిపూర, జేడీఎస్‌ సీఎం అభ్యర్థి కుమారస్వామి చెన్నపట్న, రామనగరలలో బరిలోకి దిగారు. 4.96 కోట్ల మంది ఓటర్లు...తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 2.52 కోట్ల మంది, మహిళా ఓటర్లు 2.44 కోట్ల మంది ఉన్నారు. ఇందుకోసం 58వేల 546 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Similar News