ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధానితో చర్చించనున్న అంశాలివే?

Update: 2018-06-14 03:06 GMT

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనకు రేపు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ లభించినట్లుగా తెలుస్తోంది. మోడీతో భేటీ సందర్భంగా జోనల్ వ్యవస్థ సవరణలు ఆమోదించాలని కోరనున్నారు. అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే, విభజన హామీలు అమలు చేయాలని ఆయన కోరనున్నట్టు సమాచారం. కాగా దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం రావాలని వివిధ పార్టీల అధిపతులను కేసీఆర్ కలిసిన తరువాత మొట్టమొదటగా ప్రధానితో సీఎం భేటీ అవుతున్నారు. 

Similar News