కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం

Update: 2018-01-11 07:31 GMT

వరంగల్ అర్బన్ 44వ డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.. 835 ఓట్ల మెజార్టీని బీజేపీ అభ్యర్థి కొలను సంతోష్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి అనిశెట్టి సరిత విజయం సాధించింది. కేసీఆర్, కేటీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి వల్లే టీఆర్ఎస్ కు ప్రజలు తమకు పట్టం కట్టారని ఎమ్మెల్యే విజయ భాస్కర్ అన్నారు. తమను గెలిపించిన 44వ డివిజన్ ప్రజలకు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండి సహకరించిన వివిధ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భర్త చనిపోయిన ఐదు నెలలకు వచ్చిన ఈ ఎన్నికల్లో ఒక మహిళ అని చూడకుండా ఏమాత్రం సానుభూతి తెలుపకుండా బీజేపీ పోటీ చేయటం సరికాదన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఈ విజయంతో ఎమ్మెల్యేకు 44వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. స్వీట్లు ఇచ్చి సంబరాలు చేసుకున్నారు.

Similar News