నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్దమయింది.. మహారాష్ట్రలో విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో పలు కాంట్రాక్టులు చేశారు. ఆ సమయంలో ఆయన కంపెనీ పలు అక్రమాలకు పాల్పడినట్టు మహారాష్ట్ర ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు.. ఈ అక్రమాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు ఈ నేపథ్యంలో బొల్లినేనిని ఎ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి..