తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్లో దారుణం జరిగింది. హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్ధి పెళ్లి కాకుండానే తల్లైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి ఒకటో తేదిన ఓ బిడ్డకు జన్మనిచ్చింది విద్యార్ధిని. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్సు అధికారులు విచారణకు ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం బయటపడటంతో అధికారులు నలుగురు వార్డెన్లలకు మెమోలు జారీ చేశారు. మూడు వేల మంది చదివే కాలేజ్లో ఇలాంటి ఘటన జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.