నిర్భయ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ కేసులకు శిక్ష అనుభవిస్తున్న దోషులకు ఉరే సరైన శిక్ష అని తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను తోసి పుచ్చింది. ఇలాంటి కేసుల్లో అసలు రివ్యూకు స్థానమే లేదని సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దోషులు క్షమించరాని నేరం చేశారని తీర్పులో పేర్కొంది. అటు తమ బిడ్డకు న్యాయం జరిగిందన్న నిర్భయ పేరెంట్స్.. ఉరిశిక్షను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.