కొడంగల్ శాసనసభా నియోజకవర్గంలో పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెనుకబడ్డారు. తన ప్రత్యర్థి తెరాస అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో కూడా డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కారును వెంటాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా హైస్పీడ్లో దూసుకుపోతుంది. ఇప్పటికి టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 26, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.