ఓ వెరైటీ మర్డర్ కేసు ఇప్పుడు ఆసక్తకరంగా మారింది. ఓ యువకుడు పెళ్లి కావడంలేదనే కోపంతో పక్కింటి అమ్మాయిని చంపేశాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన చత్తీస్గఢ్లో జరిగింది. వివరాల్లోకెళితే.. రాయ్పూర్కి చెందిన పింటు అనే వ్యక్తి కొంతకాలంగా పెళ్లి చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే 12సార్లు పెళ్లిచూపులు కాగా.. ఆ అమ్మాయిలందరూ అతడితో పెళ్లి ఇష్టం లేదని చెప్పారు. తన పక్కింట్లో ఉంటున్న అమెరికా పటేల్ అనే యువతి తనకు పెళ్లి కానివ్వకుండా చేతబడి చేస్తోందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పింటు పారిపోవాలని ప్రయత్నించగా చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు బీఏ రెండో సంత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.