హైదరాబాద్ లో గతనెల ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమయిన మెట్రో రైల్ పాజెక్టు లో తాను ఒక ఉద్యోగస్తురాలయినందుకు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పైలట్ వెన్నెల.. విమాన పైలట్గా తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటానని చెప్పిన వెన్నెల ఈ విషయంలో తన తల్లిద్రండ్రులకు మొదటగా కృతజ్ఞత తెలుపుకోవాలని అన్నారు.. అంతేకాదు హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఎందరో ప్రముఖులు వచ్చారు. వారిని అంత దగ్గరనుంచి చూడటం చాలా సంతోషం అనిపించింది. వారు వచ్చినప్పుడు నేను లోకో పైలట్ టీం మెంబర్గా ఉన్నందుకు ప్రౌడ్గా ఫీలయ్యాను. ఆ అనుభూతి ఎప్పటికి మరచిపోలేని సంతోషాన్నిచిందన్నారు వెన్నెల..!