వైయస్ జగన్ వ్యాఖ్యల్ని సమర్ధించిన టీడీపీ ఎమ్మెల్యే

Update: 2018-07-31 01:32 GMT

కాపు రిజర్వేషన్ల విషయంలో వైయస్ జగన్ అనుసరించిన విధానం సరైనదేనని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్‌ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, రిజర్వేషన్లు ఒక పరిమితి మించి ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ అవసరవుతుందని కృష్ణయ్య వెల్లడించారు. కాగా కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని, అది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని జగన్ అన్న సంగతి తెలిసిందే. అయన వ్యాఖ్యల్ని ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం తప్పుబట్టారు. కాపుల విషయంలో జగన్ అన్యాయంగా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. 

Similar News