హైదరాబాద్ నగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. మసాజ్, బ్యుటీషియన్ పేర్లతో గుట్టచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో శేరిలింగంపల్లిలోని స్పా సెంటర్లలో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టగా ఈ విషయం బట్టబయలైంది. స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న నలుగురు విటులు, యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం వారిని చందానగర్ పోలీసులకు అప్పగించారు. బాడీ మసాజ్ పేరుతో ఏర్పాటు చేసిన స్పా సెంటర్కు వచ్చే కస్టమర్లకు యువతులను ఎర వేస్తున్నారు నిర్వాహకులు. థాయ్లాండ్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్, టాంజానియా, నార్త్ ఇండియా, హైదరాబాద్ తోపాటు గుంటూరు, వైజాగ్ వంటి ప్రాంతాల నుంచి అందమైన యువతులను ఇక్కడికి రప్పిస్తున్నారు. ఉన్నత వర్గాలకు చెందినవారి పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతోపాటు రాజకీయ నేతల పుత్రరత్నాలు ఇందులో వున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.