నా దగ్గర డబ్బులే లేవు.. జగన్ అంత పెద్ద మొత్తం ఇవ్వలేదు: ప్రశాంత్ కిషోర్
తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన, జగన్ నుంచి తాను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజం లేదని ఆయన అన్నారు. మీడియాలో తనను జగన్ 300 నుంచి 400కోట్లు ఇచ్చి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ప్రచారం జరిగిందని.. అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.