మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు..

Update: 2018-09-09 13:05 GMT

రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ బందుకు విపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన ధరల పట్టిక చూస్తే ఇంధన ధరలు మరోసారి స్వల్పంగా పెరిగినట్లు అర్ధమవుతోంది. తాజా పెంపు ప్రకారం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీ               80.50 72.61

కోల్‌క‌త          83.39 75.46

ముంబ‌యి     87.80 77.09

చెన్నై            83.66 76.75

బెంగుళూరు   83.12 74.95

హైద‌రాబాద్   85.35 78.98

Similar News