పెట్రో ధరలు ఇంకా మండుతూనే ఉన్నాయి. రోజుకో విధంగా ఆయిల్ కంపెనీలు ఇంధన రేట్లను పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇస్తూ ఉన్నాయి. తాజాగా ఆదివారం కూడా పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయిలో పెరిగి సెంచరీకి చేరువయ్యాయి. ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ 89.29కి చేరగా డీజిల్ ధర లీటర్కు రూ 78.26కు పెరిగింది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు రూ 86.25 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ 81.91కు పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్కు రూ 73.32కు పెరిగాయి.