పొలిటికల్‌ పంచ్‌

Update: 2018-09-29 05:15 GMT

కొల్లేరు సమస్యను పార్టీలు ఓట్లకోసమే వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్థానిక నాయకులకు డబ్బు ఆశ చూపించి సమస్యను వదిలేసారని ఆయన తెలిపారు.. కొల్లేరులో తాగేందుకు కూడా నీరులేదన్న పవన్.. 110కోట్లతో రెండు రెగ్యులేటర్లు నిర్మిస్తే పరిస్థితి మారుతుందని ఆయన తెలిపారు. చింతమనేని వనజాక్షిని కొట్టినప్పుడు తాను స్పందించలేదని.. అయితే ఇష్టానుసారం పాలకులు వ్యవహరిస్తే చెల్లదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్‌ విఫలమైందన్నారు పవన్‌.
 

Similar News