తెలంగాణ విధానమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ రామచందర్ రావుకు ఆన్లైన్ మోసగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఆయనకు చెందిన రెండు బ్యాంకుల ఖాతాల నుంచి సైబర్ నేరస్తులు రూ. 35 వేలు దోచేశారు. అకౌంట్ను క్లోస్ చేసిన సైబర్ మోసగాళ్లు డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు. తన అకౌంట్లో డబ్బులు మాయం కావడంతో రామచంద్రరావు కంగుతిన్నారు. సైబర్ క్రైమ్ పీఎస్లో రాంచందర్రావు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజాప్రతినిధికే ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.