రైతు బంధు చెక్కుల పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ... తెలంగాణ వ్యాప్తంగా చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. కోడ్ అమల్లో ఉండటంతో వ్యవసాయ అధికారులు చెక్కుల పంపిణీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలలో 456 మంది రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. నాలుగు లక్షల విలువైన చెక్కులను రైతులకు అందించినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.