మోదీ ప్రభుత్వానికి వ్యక్తిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ అనంతరం అవిస్వాశానికి ఓటింగ్ నిర్వహించారు స్పీకర్.. అవిస్వాశాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు తెలపగా, వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు తెలిపారు. దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభ సోమవారానికి వాయిదా వేశారు.