పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్.. యువతి ఆత్మహత్య!

Update: 2018-05-25 06:14 GMT

పెళ్లి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగర పరిధిలోని విజయనగరంలో చోటుచేసుకుంది. విజయనగరంలో నివసించే ధన్యా(19) కి చిన్నప్పటి స్నేహితుడుడు దీనా(22) లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆరునెలల కిందట వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు విడిపోయారు. కానీ దీనా మాత్రం ఆమెను వేధింపులకు గురిచేయడం తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు.. దీంతో భయాందోళనచెందిన యువతి తల్లిదండ్రులకు చెప్పింది. వారు దీనాను మందలించారు అయినా కూడా అతనిలో మార్పు రాలేదు ఈ క్రమంలో ధన్యాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక ఈ పరిణామం దీనాకు రుచించలేదు పెళ్ళిచేసుకుంటే తనతో పాటు కుటుంబసభ్యులను అందరిని చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దాంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News