ఎమ్యెల్యే బాబుమోహన్కు సొంత నియోజకవర్గంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడానికి వచ్చిన బాబుమోహన్ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ - టిఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగి.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు.