చిత్తూరులో భూకంపం..

Update: 2018-09-19 04:21 GMT

చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. ఐరాల మండలం ఐకె రెడ్డిపల్లిలో అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో  ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే భారీ శబ్దాలు రావడంతో గ్రామస్థులు భయాందోళనతో ఎక్కడెక్కడికో పరుగులు తీశారు. అర్ధ రాత్రి వేళ ఓ పక్క వర్షం,మరో పక్క భూకంపం భయంతో గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.  మరలా మరోసారి భూకంపం వస్తుందేమోనని గ్రామస్థులు హడలిపోతున్నారు. కాగా ఈ ఘటనపై అధికారులు స్పందించినట్టు తెలుస్తోంది. ఇది సాధారణమైనదేనని పెద్దగా భయాందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. 

Similar News