నీతికి ప్రతినిధి మోడీ ఐతే.. అవినీతికి ప్రతినిధి జగన్

Update: 2018-02-21 12:01 GMT

నీతికి ప్రతినిధి మోడీ ఐతే.. అవినీతికి ప్రతినిధి జగన్ అన్నారు మంత్రి కామినేని. భవిష్యత్తులో.. బీజేపీ, వైసీపీ కలిసే చాన్సే లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ విడిపోతే.. కొంతమంది లబ్ధి పొందేందుకు చూస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో.. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తాయన్నారు. నీతి, నిజాయితీకి మోదీ ప్రతిరూపమైతే...అవినీతి, అరాచకాలకు జగన్ అన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్‌తో చేతులు కలిపే యోచన తమ పార్టీ జాతీయ నాయకత్వం చేయలేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేకాదని...ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు.

Similar News