హైదరాబాద్లో పట్టపగలు దారుణ హత్య జరిగింది. మల్కాజ్గిరి కాకతీయ నగర్లో శ్రీధర్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు నరికి చంపారు. నడిరోడ్డుపై బావను బావమరిది నరికి చంపాడు. దిల్సుఖ్నగర్కు చెందిన వినయ్ అనే వ్యక్తి సోదరితో చందర్ అనే వ్యక్తికి గత ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే... భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అంతేగాక విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. విడాకుల కేసు విచారణ నిమిత్తం ఈరోజు మల్కాజ్గిరి న్యాయస్థానానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిపై పగతో ఉన్న బావమరిది మరికొందరితో కలిసి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.