సామజిక బాధ్యతను చాటుకున్న తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యే

Update: 2018-06-30 03:51 GMT

స్పీకర్ మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పరకాలలో ఓ కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళ్తుండగా..ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్ గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో క్షతగాత్రులు  ఆసుపత్రికి వెళ్ళడానికి వాహనం కోసం వేచి చూస్తుండగా వెంటనే కాన్వాయ్ ను ఆపిన స్పీకర్, ఎమ్మెల్యే..బాధితులను తమ కాన్వాయ్ లోని వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి బాగోగులను ఆసుపత్రికి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.

Similar News