ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వినియోగదారులకు కోపం తెప్పించగా. తాజాగా వంటగ్యాస్ వినియోగదారులపై ఆయిల్ కంపెనీలు మంటపుట్టిస్తున్నాయి.ఆదివారం నుంచి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేసాయి. ఈ మేరకు రాయితీ సిలిండరు ధర రూ.2.71 పైసలు పెరిగింది. ఈ పెంపు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లో కి రానుంది. దీంతో ఢిల్లీలో ఏకంగా సిలిండరు ధర రూ. 493.55 అవుతుందని భారత చమురు సంస్థ తెలిపింది. అంతర్జాతీయ రేట్ల లో పెరుగుదల కారణంగా వంటగ్యాస్ ధర పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.