నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకార కాలనీ పర్యటనకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పార్టీ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ కావాలనే అడ్డుకుంటోందని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.