గుడ్లు విసిరినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి

Update: 2018-01-19 11:10 GMT

తనపై జరిగిన దాడి గురించి సినీ విమర్శకుడు కత్తి మహేష్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత రాత్రి కారులో కత్తి మహేష్ జూబ్లీహిల్స్ నుంచి కొండాపూర్ వెళుతున్నారు. శిల్పారామం సమీపంలో కత్తి మహేష్ పై  గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. తనపై పవన్ కళ్యాణ‌్ ఫ్యాన్స్ దాడి చేశారని కత్తి మహేష్ అనుమానం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనకు, పవన్ అభిమానులకు మధ్య నాలుగు నెలలుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తున్నందున తనపై పవన్ ఫ్యాన్సే దాడి చేసి ఉంటారని నమ్ముతున్నట్టు మహేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News