తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ప్రలోభాలకు పాల్పడ్డారని తెలిపింది. తమ ఎమ్మెల్యే భార్యతో 5 కోట్లు, మంత్రి పదవిని ఆఫర్ చేశారని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది. ఈ సాయంత్రం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో సంచలనంగా మారింది.