రాజీనామాచేసిన కుమారస్వామి.. బరిలోకి భార్య అనిత!

Update: 2018-05-20 12:34 GMT

బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కుమారస్వామి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలనుంచి గెలిపొందారు. మొదటగా చెన్నపట్నం నుంచి నామినేషన వేసిన ఆయన ఆ తరువాత రామనగర అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. రెండు సీట్లలో జేడీఎస్ గెలవడంతో కుమారస్వామి రామనగర సీటుకు రాజీనామాచేశారు 
కాగా చెన్నపట్టణ నియోజకవర్గం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.. రామనగర సీటును వదులుకోవడంతో. అక్కడి నుంచి తన  భార్య అనితను లేదా చిన్న భార్య రాధికను బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాధిక మాత్రం పోటీకి అంతగా ఆసక్తి కనబరచడం లేదంటూ ప్రచారం జరుగుతోంది.  వీరు కానీ పక్షంలో   కుమారుడు నిఖిల్‌ను బరిలో ఉంచే అవకాశం ఉంది.

Similar News