కర్ణాటక కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరను ఫైనల్ చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సోనియా నిర్ణయంతో ఆ పార్టీసీనియర్ నేత తాజా మాజీ మంత్రి డీకే శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవిపై డీకే ఆశలుపెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కూడా ఆయనే సీఎం అవుతారని భావించారు కానీ అనూహ్యంగా ఆ పదవీ సిద్దరామయ్యను వరించింది. తాజాగా ఆయనకు దక్కుతుందన్న డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కకపోవడంతో అయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు.