జనసేన పార్టీలో చేరుతున్నారన్న వార్తలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొట్టిపారేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నది వాస్తవమేనని, ఆ దరఖాస్తు మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందన్నారు.. ప్రభుత్వ ఆమోదించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.మరోవైపు లక్ష్మినారాయణ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ, ఆయన వస్తే జనసేనలోకి ఆహ్వానిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.