ఇంగ్లాండ్ లో దారుణ హత్యకు గురైన మహిళ!

Update: 2018-05-18 05:35 GMT

ఇంగ్లాండ్ లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో జెస్సీకా పటేల్ అనే మహిళపై దుండగులు తీవ్రంగా దాడి చేసి హతమార్చారు. ఇంగ్లాండ్ మిడిల్స్‌బరో  ప్రాంతంలో నివాసముండే  జెస్సీకా, మితేష్‌ దంపతులు.. వీరు యూనివర్శిటీలో చదువుకునే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇంటికి సమీపంలో ఫార్మసీని నడుపుతున్నారు. ఈ క్రమంలో జెస్సీకా హఠాత్తుగా హత్యకు గురైంది. కాగా హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారి ఇంటికి దగ్గరలో ఉండే స్థానికులను కూడా విచారిస్తున్నారు.  

Similar News